భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి.. మల్లెల సన్మతరావు...
భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి.. మల్లెల సన్మతరావు...
Editor Desk
భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడంతో పాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మంతరావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని పద్మా రెడ్డి భవనంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 23 సంవత్సరాల వయసులోనే దేశ స్వతంత్రం కోసం పోరాడిన ధీరుడని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానూ సంపూర్ణ స్వతంత్రం కావాలని, బ్రిటిష్ ప్రభుత్వం పై నిరసన తెలిపే కార్యక్రమంలో బాగంగా భగత్ సింగ్ ఆ నాటి పార్లమెంట్ భవనంలో పొగ బాంబులు విసిన మొనగాడని గుర్తు చేశారు. పార్లమెంట్ భవనంలో ప్రజానీకానికి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఉండడం ఉద్దేశంతోనే పొగ బాంబు విసిగినట్టు తెలిపారు. దేశ స్వతంత్రం కోసం రాజ్ గురు, సుకుదేవ్ ,భగత్ సింగ్ ముగ్గురు దేశ స్వాతంత్ర పోరాట యోధులని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, మండల కమిటీ సభ్యులు శీలం గురుమూర్తి, చిట్టారి వెంకన్న, చీర్ల రాధాకృష్ణ, జవ్వాజి శ్రీను, ఎస్.కె బాబు ,కొక్కిరేణి వెంకన్న, చిట్టూరి సీతారామయ్య, సింగం కృష్ణంరాజు ,గడ్డం పవన్, వి ఉపేందర్, విజయపాల్, తదితరులు పాల్గొని నివాళులర్పించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి