Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:43 PM

భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి.. మల్లెల సన్మతరావు...

భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి.. మల్లెల సన్మతరావు...

భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి..  మల్లెల సన్మతరావు...
March 23, 2026 04:35 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడంతో పాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మంతరావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని పద్మా రెడ్డి భవనంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 23 సంవత్సరాల వయసులోనే దేశ స్వతంత్రం కోసం పోరాడిన ధీరుడని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానూ సంపూర్ణ స్వతంత్రం కావాలని, బ్రిటిష్ ప్రభుత్వం పై నిరసన తెలిపే కార్యక్రమంలో బాగంగా భగత్ సింగ్ ఆ నాటి పార్లమెంట్ భవనంలో పొగ బాంబులు విసిన మొనగాడని గుర్తు చేశారు. పార్లమెంట్ భవనంలో ప్రజానీకానికి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఉండడం ఉద్దేశంతోనే పొగ బాంబు విసిగినట్టు తెలిపారు. దేశ స్వతంత్రం కోసం రాజ్ గురు, సుకుదేవ్ ,భగత్ సింగ్ ముగ్గురు దేశ స్వాతంత్ర పోరాట యోధులని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, మండల కమిటీ సభ్యులు శీలం గురుమూర్తి, చిట్టారి వెంకన్న, చీర్ల రాధాకృష్ణ, జవ్వాజి శ్రీను, ఎస్.కె బాబు ,కొక్కిరేణి వెంకన్న, చిట్టూరి సీతారామయ్య, సింగం కృష్ణంరాజు ,గడ్డం పవన్, వి ఉపేందర్, విజయపాల్, తదితరులు పాల్గొని నివాళులర్పించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News