Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:01 PM

భద్రాద్రి రాముడిపై పంచాయితీ.. ఏంటి వివాదం..?

భద్రాద్రి రాముడిపై పంచాయితీ.. ఏంటి వివాదం..?

భద్రాద్రి రాముడిపై పంచాయితీ.. ఏంటి వివాదం..?
23-03-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భద్రాద్రి శ్రీరాముడి గోత్ర వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో విషయం న్యాయస్థానానికి చేరింది.ఇప్పటి వరకు భద్రాద్రి రామయ్యను దశరథ పుత్రుడిగా, వశిష్ట గోత్రికుడిగా, సీతమ్మను గౌతమస గోత్రంగా పండితులు పేర్కొంటూ వచ్చారు. అయితే 2012 సంవత్సరం తర్వాత ఆలయంలో ఉన్నది రామనారాయణుడని, అందువల్ల గోత్రాన్ని ‘అచ్యుత’గా, సీతాదేవి గోత్రాన్ని ‘సౌభాగ్య’గా పేర్కొంటున్నారని ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై 2022లో హైకోర్టును ఆశ్రయించిన ఆయన, ఆలయంలో పఠించే గోత్రాలలో మార్పులు చట్టబద్ధమా కాదా అనే విషయంపై స్పష్టత కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ప్రత్యేక కమిటీని నియమించింది.

కోర్టు ఆదేశాల మేరకు కమిటీ 2024లో దేవదాయ శాఖకు తన నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికను ప్రజలకు వెల్లడించకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు.ఈ కేసు పై నేడు విచారణ జరగనుంది. భద్రాద్రి ఆలయ ఆచారాలపై ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో అన్నది భక్తుల్లో ఆసక్తిగా మారింది.

Sthanikam

భద్రాద్రి రాముడిపై పంచాయితీ.. ఏంటి వివాదం..?

Article Image

భద్రాద్రి శ్రీరాముడి గోత్ర వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో విషయం న్యాయస్థానానికి చేరింది.ఇప్పటి వరకు భద్రాద్రి రామయ్యను దశరథ పుత్రుడిగా, వశిష్ట గోత్రికుడిగా, సీతమ్మను గౌతమస గోత్రంగా పండితులు పేర్కొంటూ వచ్చారు. అయితే 2012 సంవత్సరం తర్వాత ఆలయంలో ఉన్నది రామనారాయణుడని, అందువల్ల గోత్రాన్ని ‘అచ్యుత’గా, సీతాదేవి గోత్రాన్ని ‘సౌభాగ్య’గా పేర్కొంటున్నారని ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై 2022లో హైకోర్టును ఆశ్రయించిన ఆయన, ఆలయంలో పఠించే గోత్రాలలో మార్పులు చట్టబద్ధమా కాదా అనే విషయంపై స్పష్టత కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ప్రత్యేక కమిటీని నియమించింది.

కోర్టు ఆదేశాల మేరకు కమిటీ 2024లో దేవదాయ శాఖకు తన నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికను ప్రజలకు వెల్లడించకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు.ఈ కేసు పై నేడు విచారణ జరగనుంది. భద్రాద్రి ఆలయ ఆచారాలపై ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో అన్నది భక్తుల్లో ఆసక్తిగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News