భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు
భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు
Editor Desk
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం శ్రీరామాలయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి విడతల వారీగా రూ.560 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
గత పది సంవత్సరాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు చేయలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాల్లో ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదని చెప్పారు.
పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నదని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్కే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి