Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 09:59 PM

భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు

భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు

భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు
March 26, 2026 08:36 PM 1 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం శ్రీరామాలయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి విడతల వారీగా రూ.560 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

గత పది సంవత్సరాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు చేయలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాల్లో ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదని చెప్పారు.

పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నదని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతోందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News