Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:20 AM

భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు

భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు

భద్రాచలం ఆలయాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: రాయల నాగేశ్వరరావు
March 26, 2026 08:36 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం శ్రీరామాలయాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి విడతల వారీగా రూ.560 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

గత పది సంవత్సరాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు చేయలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాల్లో ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదని చెప్పారు.

పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో కూడా గత ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నదని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతోందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News