భైరవునిపల్లిలో విషాద కుటుంబానికి అండగా మల్లి బాబు యాదవ్
భైరవునిపల్లిలో విషాద కుటుంబానికి అండగా మల్లి బాబు యాదవ్
స్థానికం బృందం
భైరవునిపల్లిలో దశదినకర్మలకు హాజరై కుటుంబాన్ని పరామర్శించిన మల్లి బాబు యాదవ్
నేలకొండపల్లి: స్థానికం ప్రతినిధి జనార్దన్ రావు
నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి గ్రామానికి చెందిన కనక బండి నారాయణ యాదవ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, సోమవారం నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమాలకు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్ హాజరై కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు తో కలిసి నారాయణ యాదవ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ, 1992–93లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏర్పడిన గొర్రెల సంఘాల ఉద్యమంలో భాగంగా భైరవునిపల్లిలో మురళీకృష్ణ గొర్రెల పెంపకదారుల సంఘం ఏర్పాటుకు కనక బండి నారాయణ చేసిన కృషి మరువలేనిదని గుర్తు చేశారు. పెద్దల సహకారం వల్లనే తాను అప్పట్లో జిల్లా అంతటా తిరిగి సంఘాల అభివృద్ధికి పాటుపడగలిగినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కనక బండి వెంకటేశ్వర్లు, కనక బండి రమేష్, రెడ్డి బోయిన సత్యనారాయణ, మల్లె బోయిన ఉపేందర్, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, బుర్ర కృష్ణ, మల్లె బోయిన శ్రీనివాస్, మన్నె కృష్ణ, తెలగొర్ల లింగస్వామి, రాసాల కనకయ్య, కనక బండి కనకరాజు, చంద్రకాని మధు, నూక చిన్న నాగయ్య, మల్లె బోయిన గోవిందరావు తదితర యాదవ బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి