Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:05 AM

బెట్టింగ్ ఆడినా ఆడించినా కఠిన చర్యలు: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక

బెట్టింగ్ ఆడినా ఆడించినా కఠిన చర్యలు: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక

బెట్టింగ్ ఆడినా ఆడించినా కఠిన చర్యలు: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక
29-04-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల పరిధిలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో యువత బెట్టింగ్ యాప్‌లకు బానిసలై అప్పులపాలవుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్నేహితులు లేదా బంధువుల వద్ద తరచూ డబ్బులు అప్పుగా అడుగుతున్నట్లయితే కారణాలు తెలుసుకోవాలని సూచించారు. సమస్య తీవ్రంగా మారే వరకు చాలా కుటుంబాలకు విషయం తెలియకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్లు లేదా ఆడిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమాజం మొత్తం కలిసి ఈ అక్రమ బెట్టింగ్ వ్యవస్థను అరికట్టాలని పిలుపునిచ్చారు.

Sthanikam

బెట్టింగ్ ఆడినా ఆడించినా కఠిన చర్యలు: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక

Article Image

కంగ్టి మండల పరిధిలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో యువత బెట్టింగ్ యాప్‌లకు బానిసలై అప్పులపాలవుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్నేహితులు లేదా బంధువుల వద్ద తరచూ డబ్బులు అప్పుగా అడుగుతున్నట్లయితే కారణాలు తెలుసుకోవాలని సూచించారు. సమస్య తీవ్రంగా మారే వరకు చాలా కుటుంబాలకు విషయం తెలియకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్లు లేదా ఆడిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమాజం మొత్తం కలిసి ఈ అక్రమ బెట్టింగ్ వ్యవస్థను అరికట్టాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News