బెట్టింగ్ ఆడినా ఆడించినా కఠిన చర్యలు: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక
బెట్టింగ్ ఆడినా ఆడించినా కఠిన చర్యలు: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక
Krishna
కంగ్టి మండల పరిధిలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో యువత బెట్టింగ్ యాప్లకు బానిసలై అప్పులపాలవుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్నేహితులు లేదా బంధువుల వద్ద తరచూ డబ్బులు అప్పుగా అడుగుతున్నట్లయితే కారణాలు తెలుసుకోవాలని సూచించారు. సమస్య తీవ్రంగా మారే వరకు చాలా కుటుంబాలకు విషయం తెలియకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్లు లేదా ఆడిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమాజం మొత్తం కలిసి ఈ అక్రమ బెట్టింగ్ వ్యవస్థను అరికట్టాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి