బీసీలకు బడ్జెట్లో భారీ అన్యాయం – వట్టె జానయ్య యాదవ్ ఆగ్రహం
బీసీలకు బడ్జెట్లో భారీ అన్యాయం – వట్టె జానయ్య యాదవ్ ఆగ్రహం
Biksham
సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ నిరసన ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యులు వట్టె జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. బీసీలు రాష్ట్రంలో అధిక శాతం ఉన్నప్పటికీ బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. బీసీల ఓట్ల కోసం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పటికీ ముందుంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్కు వినతి పత్రం అందజేశారు.
ఈ ర్యాలీలో పార్టీ నాయకులు మామిడి అంజయ్య, మీర్ అక్బర్, కొన్నె మంజుల గౌడ్, నారాయణదాసు కవిత, కుంభం నాగరాజు, సోమగాని లింగస్వామి, బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, మురళి, కోల కరుణాకర్, సేవ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే నాయకులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలుస్తుందని వట్టె జానయ్య యాదవ్ పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి