Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:48 PM

బీసీ వర్గాలకు రాజకీయ అధికారం అవసరం:తీన్మార్ మల్లన్న

బీసీ వర్గాలకు రాజకీయ అధికారం అవసరం:తీన్మార్ మల్లన్న

బీసీ వర్గాలకు రాజకీయ అధికారం అవసరం:తీన్మార్ మల్లన్న
January 18, 2026 10:59 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గ్రామస్థాయిలో బీసీల పాలన బలోపేతం కావాలి

బీసీల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం:హరిశంకర్ గౌడ్

స్థానికం:జిల్లా బ్యూరో శ్రీనివాస్

జనగామ పట్టణ కేంద్రంలోని ఎన్‌ఎంఆర్ గార్డెన్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీసీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ నేవిలి సంపత్ అధ్యక్షత వహించగా,ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఆయనతో కలిసి సభకు హాజరైన టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరి శంకర్ గౌడ్ సభను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా సుదగాని హరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ, బీసీ వర్గాల రాజకీయ సాధికారతతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వట్టే జానయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలబోయన ఓదెలు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్, జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకూరి మౌనిక యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిరాజ్తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు,బీసీ,ఎస్సీ సంఘాల నాయకులు,పార్టీ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News