బీసీ వర్గాలకు రాజకీయ అధికారం అవసరం:తీన్మార్ మల్లన్న
బీసీ వర్గాలకు రాజకీయ అధికారం అవసరం:తీన్మార్ మల్లన్న
Sthanikam District Staff Reporter
గ్రామస్థాయిలో బీసీల పాలన బలోపేతం కావాలి
బీసీల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం:హరిశంకర్ గౌడ్
స్థానికం:జిల్లా బ్యూరో శ్రీనివాస్
జనగామ పట్టణ కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీసీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ నేవిలి సంపత్ అధ్యక్షత వహించగా,ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఆయనతో కలిసి సభకు హాజరైన టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరి శంకర్ గౌడ్ సభను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా సుదగాని హరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ, బీసీ వర్గాల రాజకీయ సాధికారతతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వట్టే జానయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలబోయన ఓదెలు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్, జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకూరి మౌనిక యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిరాజ్తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు,బీసీ,ఎస్సీ సంఘాల నాయకులు,పార్టీ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి