Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:17 PM

బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు కల్పించాలి : బ్యాంకు ఉద్యోగుల డిమాండ్

బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు కల్పించాలి : బ్యాంకు ఉద్యోగుల డిమాండ్

బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు కల్పించాలి : బ్యాంకు ఉద్యోగుల డిమాండ్
January 27, 2026 06:59 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ప్రభుత్వ రంగ బ్యాంకులకు వారానికి ఐదు పని దినాలు మాత్రమే కల్పించాలని ఎస్‌బీఐ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఐతగాని మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారంలో ప్రతి శనివారం సెలవు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పది సంవత్సరాల క్రితమే బ్యాంకు మేనేజ్‌మెంట్ ఈ అంశాన్ని అంగీకరించినప్పటికీ, రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత కూడా ఇప్పటివరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అన్ని బ్యాంకు యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకు రెండు శనివారాలకే సెలవులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఆఫీసర్ల అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్. భాస్కర్, యూనియన్ బ్యాంక్ కార్యదర్శి నరేష్, కెనరా బ్యాంక్ కార్యదర్శి సట్టు రామకృష్ణతో పాటు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News