బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు కల్పించాలి : బ్యాంకు ఉద్యోగుల డిమాండ్
బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు కల్పించాలి : బ్యాంకు ఉద్యోగుల డిమాండ్
Vikram
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
ప్రభుత్వ రంగ బ్యాంకులకు వారానికి ఐదు పని దినాలు మాత్రమే కల్పించాలని ఎస్బీఐ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఐతగాని మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారంలో ప్రతి శనివారం సెలవు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పది సంవత్సరాల క్రితమే బ్యాంకు మేనేజ్మెంట్ ఈ అంశాన్ని అంగీకరించినప్పటికీ, రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత కూడా ఇప్పటివరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అన్ని బ్యాంకు యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకు రెండు శనివారాలకే సెలవులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఆఫీసర్ల అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్. భాస్కర్, యూనియన్ బ్యాంక్ కార్యదర్శి నరేష్, కెనరా బ్యాంక్ కార్యదర్శి సట్టు రామకృష్ణతో పాటు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి