Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:03 PM

బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు

బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు

బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు
13-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మొరిశెట్టి నివేదిత లక్షాది, హనుమంతరెడ్డి, మీలా మహదేవ్.

సూర్యాపేట జిల్లా, : వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కేంద్రంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుధాకర్ గ్రూప్ సంస్థ సహకారం అందించడం అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు.జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట, 48వ వార్డు కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపాలిటీ, సుధాకర్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి, సంస్థ ప్రతినిధి మీలా మహదేవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎండలు రోజురోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వడదెబ్బ, నీరసం వంటి సమస్యలు రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వేసవి కాలంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్లు కొనతం రాజేష్, వెలుగు వెంకన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు

Article Image

మొరిశెట్టి నివేదిత లక్షాది, హనుమంతరెడ్డి, మీలా మహదేవ్.

సూర్యాపేట జిల్లా, : వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కేంద్రంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుధాకర్ గ్రూప్ సంస్థ సహకారం అందించడం అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు.జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట, 48వ వార్డు కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపాలిటీ, సుధాకర్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి, సంస్థ ప్రతినిధి మీలా మహదేవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎండలు రోజురోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వడదెబ్బ, నీరసం వంటి సమస్యలు రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వేసవి కాలంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్లు కొనతం రాజేష్, వెలుగు వెంకన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News