బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు
బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు
Biksham
మొరిశెట్టి నివేదిత లక్షాది, హనుమంతరెడ్డి, మీలా మహదేవ్.
సూర్యాపేట జిల్లా, : వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కేంద్రంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుధాకర్ గ్రూప్ సంస్థ సహకారం అందించడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు.జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట, 48వ వార్డు కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపాలిటీ, సుధాకర్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి, సంస్థ ప్రతినిధి మీలా మహదేవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎండలు రోజురోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వడదెబ్బ, నీరసం వంటి సమస్యలు రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వేసవి కాలంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్లు కొనతం రాజేష్, వెలుగు వెంకన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి