Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్వాపూర్ ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టత కావాలి. రైతులకు నీరు వచ్చే వరకు పోరాటం: బీఎస్పీ స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 11:49 AM

బస్వాపూర్ ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టత కావాలి. రైతులకు నీరు వచ్చే వరకు పోరాటం: బీఎస్పీ

బస్వాపూర్ ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టత కావాలి. రైతులకు నీరు వచ్చే వరకు పోరాటం: బీఎస్పీ

బస్వాపూర్ ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టత కావాలి. రైతులకు నీరు వచ్చే వరకు పోరాటం: బీఎస్పీ
March 25, 2026 10:02 AM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నకిరేకల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలపై బహుజన సమాజ్ పార్టీ స్పందించింది. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రస్తావించడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పూర్తి విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని బీఎస్పీ నేతలు విమర్శించారు.

నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రైతులకు సాగునీరు అందుతుందని సంవత్సరాలుగా చెబుతున్నప్పటికీ, పనులు ఇంకా పూర్తికాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ప్రత్యేకంగా రామన్నపేట, చిట్యాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్ట్ పనులను వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది పై నిర్మించాల్సిన బ్రిడ్జ్ పనులను తక్షణమే ప్రారంభించి, ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టమైన సమయపట్టిక ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతులకు నిజంగా సాగునీరు అందే వరకు బహుజన సమాజ్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News