బస్వాపూర్ ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టత కావాలి. రైతులకు నీరు వచ్చే వరకు పోరాటం: బీఎస్పీ
బస్వాపూర్ ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టత కావాలి. రైతులకు నీరు వచ్చే వరకు పోరాటం: బీఎస్పీ
Editor Desk
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నకిరేకల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలపై బహుజన సమాజ్ పార్టీ స్పందించింది. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రస్తావించడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పూర్తి విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని బీఎస్పీ నేతలు విమర్శించారు.
నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రైతులకు సాగునీరు అందుతుందని సంవత్సరాలుగా చెబుతున్నప్పటికీ, పనులు ఇంకా పూర్తికాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ప్రత్యేకంగా రామన్నపేట, చిట్యాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్ట్ పనులను వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నది పై నిర్మించాల్సిన బ్రిడ్జ్ పనులను తక్షణమే ప్రారంభించి, ప్రాజెక్ట్ పూర్తి పై స్పష్టమైన సమయపట్టిక ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతులకు నిజంగా సాగునీరు అందే వరకు బహుజన సమాజ్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి