Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:59 AM

బస్వాపూర్ ఆర్‌అండ్‌ఆర్ లేఅవుట్లపై కలెక్టర్ ఫోకస్

బస్వాపూర్ ఆర్‌అండ్‌ఆర్ లేఅవుట్లపై కలెక్టర్ ఫోకస్

బస్వాపూర్ ఆర్‌అండ్‌ఆర్ లేఅవుట్లపై కలెక్టర్ ఫోకస్
March 24, 2026 02:36 PM 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించిన పునరావాసం, పునర్వ్యవస్థీకరణ (ఆర్‌అండ్‌ఆర్) ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న బి.ఎన్. తిమ్మాపురం, లప్పానాయక్ తండా లేఅవుట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. ఆయనతో పాటు రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లేఅవుట్లలో కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల పనులను కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని తెలుసుకుని, మిగిలిన పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాలనీల్లో నివసించే ప్రజలకు అవసరమైన రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలను త్వరితగతిన కల్పించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ, అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాలనీలోకి వెళ్లే మట్టి రహదారులను చదును చేసి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మండలం తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News