బస్వాపూర్ ఆర్అండ్ఆర్ లేఅవుట్లపై కలెక్టర్ ఫోకస్
బస్వాపూర్ ఆర్అండ్ఆర్ లేఅవుట్లపై కలెక్టర్ ఫోకస్
Editor Desk
మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు
భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్కు సంబంధించిన పునరావాసం, పునర్వ్యవస్థీకరణ (ఆర్అండ్ఆర్) ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న బి.ఎన్. తిమ్మాపురం, లప్పానాయక్ తండా లేఅవుట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. ఆయనతో పాటు రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లేఅవుట్లలో కొనసాగుతున్న, పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల పనులను కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని తెలుసుకుని, మిగిలిన పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాలనీల్లో నివసించే ప్రజలకు అవసరమైన రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలను త్వరితగతిన కల్పించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ, అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాలనీలోకి వెళ్లే మట్టి రహదారులను చదును చేసి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి మండలం తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి