Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:01 AM

బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు

బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు

బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు
January 05, 2026 01:58 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

లక్షల ఎకరాలకు సాగునీటి ఆశ.. బసవపురం ప్రాజెక్టుపై సీఎంకు విజ్ఞప్తి

స్థానికం: యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బసవపురం ప్రాజెక్టుకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మర్యాదపూర్వకంగా కలిసి బలమైన విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల విరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు అందితే లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని,తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం పచ్చని పంటలతో శ్యామలమయంగా మారుతుందని స్పష్టం చేశారు. రైతాంగానికి ఇది జీవనాధారంగా మారడమే కాకుండా, ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బసవపురం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం ద్వారా రైతుల కల నెరవేరే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోందని,సీఎం ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని నేతలు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News