Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:05 AM

బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు

బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు

బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు
January 05, 2026 01:58 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

లక్షల ఎకరాలకు సాగునీటి ఆశ.. బసవపురం ప్రాజెక్టుపై సీఎంకు విజ్ఞప్తి

స్థానికం: యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బసవపురం ప్రాజెక్టుకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మర్యాదపూర్వకంగా కలిసి బలమైన విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల విరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు అందితే లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని,తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం పచ్చని పంటలతో శ్యామలమయంగా మారుతుందని స్పష్టం చేశారు. రైతాంగానికి ఇది జీవనాధారంగా మారడమే కాకుండా, ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బసవపురం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం ద్వారా రైతుల కల నెరవేరే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోందని,సీఎం ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని నేతలు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News