బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు
బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు
Sthanikam District Staff Reporter
లక్షల ఎకరాలకు సాగునీటి ఆశ.. బసవపురం ప్రాజెక్టుపై సీఎంకు విజ్ఞప్తి
స్థానికం: యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బసవపురం ప్రాజెక్టుకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మర్యాదపూర్వకంగా కలిసి బలమైన విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల విరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బసవపురం ప్రాజెక్టుకు నీళ్లు అందితే లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని,తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం పచ్చని పంటలతో శ్యామలమయంగా మారుతుందని స్పష్టం చేశారు. రైతాంగానికి ఇది జీవనాధారంగా మారడమే కాకుండా, ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బసవపురం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం ద్వారా రైతుల కల నెరవేరే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోందని,సీఎం ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని నేతలు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి