Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:52 PM

బస్సు తనిఖీలో ఉద్రిక్తత.. టికెట్ తనిఖీ అధికారిపై దాడి

బస్సు తనిఖీలో ఉద్రిక్తత.. టికెట్ తనిఖీ అధికారిపై దాడి

బస్సు తనిఖీలో ఉద్రిక్తత.. టికెట్ తనిఖీ అధికారిపై దాడి
May 01, 2026 03:47 PM 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధుల్లో భాగంగా బస్సు తనిఖీ చేస్తున్న ఆర్టీసీ టికెట్ తనిఖీ అధికారులపై బస్సు కండక్టర్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఝరాసంగం మండలం కప్పాడు వద్ద నారాయణఖేడ్ డిపోకు చెందిన టీజీ15జెడ్0082 బస్సును టిటిఐ ఏసయ్య, టిటిఐ ప్రకాశ్, డ్రైవర్ ప్రతాప్ కలిసి తనిఖీ చేయగా ఒక ప్రయాణికునికి మహిళలకు ఉచిత ప్రయాణం కోసం జారీ చేసే జీరో ఎంహెచ్‌సీ టికెట్ ఇచ్చి రూ.20 వసూలు చేసినట్లు గుర్తించారు. దీనిపై కండక్టర్ వసంత్‌కు చార్జి మెమో జారీ చేయగా అతడు సంతకం చేయకుండా ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు. అనంతరం ప్రయాణికులను రెచ్చగొట్టి టిటిలపై చెప్పులతో దాడి చేయడంతో పాటు చార్జి మెమో బుక్ మరియు సంబంధిత టికెట్‌ను చించివేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో టిటిఐ ఏసయ్యకు ఎడమ చేతి బొటనవేలికి, టిటిఐ ప్రకాశ్‌కు నుదిటిపై గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కండక్టర్ వసంత్‌తో పాటు సంబంధిత ప్రయాణికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడే పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News