బస్సు తనిఖీలో ఉద్రిక్తత.. టికెట్ తనిఖీ అధికారిపై దాడి
బస్సు తనిఖీలో ఉద్రిక్తత.. టికెట్ తనిఖీ అధికారిపై దాడి
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలో రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధుల్లో భాగంగా బస్సు తనిఖీ చేస్తున్న ఆర్టీసీ టికెట్ తనిఖీ అధికారులపై బస్సు కండక్టర్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఝరాసంగం మండలం కప్పాడు వద్ద నారాయణఖేడ్ డిపోకు చెందిన టీజీ15జెడ్0082 బస్సును టిటిఐ ఏసయ్య, టిటిఐ ప్రకాశ్, డ్రైవర్ ప్రతాప్ కలిసి తనిఖీ చేయగా ఒక ప్రయాణికునికి మహిళలకు ఉచిత ప్రయాణం కోసం జారీ చేసే జీరో ఎంహెచ్సీ టికెట్ ఇచ్చి రూ.20 వసూలు చేసినట్లు గుర్తించారు. దీనిపై కండక్టర్ వసంత్కు చార్జి మెమో జారీ చేయగా అతడు సంతకం చేయకుండా ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు. అనంతరం ప్రయాణికులను రెచ్చగొట్టి టిటిలపై చెప్పులతో దాడి చేయడంతో పాటు చార్జి మెమో బుక్ మరియు సంబంధిత టికెట్ను చించివేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో టిటిఐ ఏసయ్యకు ఎడమ చేతి బొటనవేలికి, టిటిఐ ప్రకాశ్కు నుదిటిపై గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కండక్టర్ వసంత్తో పాటు సంబంధిత ప్రయాణికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడే పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి