Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:19 PM

బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు

బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు

బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు
March 25, 2026 01:12 PM 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని నియోజకవర్గం పరిధిలోని బసాపురం గ్రామంలో “రైతన్న మీకోసం వారోత్సవాలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిడిపి ఇన్చార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయగా, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బిటి నాయుడు హాజరయ్యారు. అలాగే ఉమాపతి నాయుడు కూడా పాల్గొని 6వ విడత “అన్నదాత సుఖీభవ” ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో జమవుతున్న పెట్టుబడి సహాయ నిధుల వివరాలను తెలియజేశారు.

అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం, సబ్సిడీపై అందుతున్న వ్యవసాయ పరికరాలు, వడ్డీ లేని రుణాలు, ఆధునిక సాంకేతికతతో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతు కుటుంబానికి పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్ఎంసి వాటర్ చైర్మన్ రామస్వామి, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, నీలకంఠప్ప, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, సత్తన్న, రంగన్న, అయ్యన్న, వీరారెడ్డి, సుధాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News