Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట అభివృద్ధికి నియోజకవర్గ హోదా కీలకం: రమేష్ గౌడ్ స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 02:41 PM

బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు

బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు

బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు
March 25, 2026 01:12 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని నియోజకవర్గం పరిధిలోని బసాపురం గ్రామంలో “రైతన్న మీకోసం వారోత్సవాలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిడిపి ఇన్చార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయగా, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బిటి నాయుడు హాజరయ్యారు. అలాగే ఉమాపతి నాయుడు కూడా పాల్గొని 6వ విడత “అన్నదాత సుఖీభవ” ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో జమవుతున్న పెట్టుబడి సహాయ నిధుల వివరాలను తెలియజేశారు.

అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం, సబ్సిడీపై అందుతున్న వ్యవసాయ పరికరాలు, వడ్డీ లేని రుణాలు, ఆధునిక సాంకేతికతతో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతు కుటుంబానికి పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్ఎంసి వాటర్ చైర్మన్ రామస్వామి, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, నీలకంఠప్ప, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, సత్తన్న, రంగన్న, అయ్యన్న, వీరారెడ్డి, సుధాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News