బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు
బసాపురం గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలు
Editor Desk
ఆదోని నియోజకవర్గం పరిధిలోని బసాపురం గ్రామంలో “రైతన్న మీకోసం వారోత్సవాలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిడిపి ఇన్చార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయగా, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బిటి నాయుడు హాజరయ్యారు. అలాగే ఉమాపతి నాయుడు కూడా పాల్గొని 6వ విడత “అన్నదాత సుఖీభవ” ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో జమవుతున్న పెట్టుబడి సహాయ నిధుల వివరాలను తెలియజేశారు.
అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం, సబ్సిడీపై అందుతున్న వ్యవసాయ పరికరాలు, వడ్డీ లేని రుణాలు, ఆధునిక సాంకేతికతతో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతు కుటుంబానికి పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్ఎంసి వాటర్ చైర్మన్ రామస్వామి, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, నీలకంఠప్ప, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, సత్తన్న, రంగన్న, అయ్యన్న, వీరారెడ్డి, సుధాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి