Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:04 AM

బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగునీరు: మంత్రి కోమటిరెడ్డి

బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగునీరు: మంత్రి కోమటిరెడ్డి

బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగునీరు: మంత్రి కోమటిరెడ్డి
22-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

శనివారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రాజెక్టు కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి, రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నిర్మించనున్న పిల్లకాలువ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు కాలువల ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నింటిని నింపి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగుతుందని అన్నారు.

నల్లగొండ నియోజకవర్గం తనకు గుండెకాయలాంటిదని, అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడం తన లక్ష్యమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

అప్పాజీపేట గ్రామంలో పిల్లకాలువ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి, సర్పంచ్ గంగుల అండాలు సైదులు, ఇరిగేషన్ అధికారులు సతీష్ చంద్ర, పిచ్చయ్య, నవీన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి సాగునీరు: మంత్రి కోమటిరెడ్డి

Article Image

నల్లగొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

శనివారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రాజెక్టు కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి, రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నిర్మించనున్న పిల్లకాలువ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు కాలువల ద్వారా నియోజకవర్గంలోని చెరువులన్నింటిని నింపి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగుతుందని అన్నారు.

నల్లగొండ నియోజకవర్గం తనకు గుండెకాయలాంటిదని, అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడం తన లక్ష్యమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

అప్పాజీపేట గ్రామంలో పిల్లకాలువ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి, సర్పంచ్ గంగుల అండాలు సైదులు, ఇరిగేషన్ అధికారులు సతీష్ చంద్ర, పిచ్చయ్య, నవీన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News