బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
Prabhakar
బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణబ్రాహ్మణ సేవా వాహిని యూత్ విభాగం ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ఈనెల 8 ఆదివారం నిర్వహించనున్న బ్రాహ్మణ యువజన మహాసభకుసంబంధించినపోస్టర్నుహనుమాన్పేటలోని బ్రాహ్మణ సేవా వాహిని కార్యాలయంలో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర అధ్యక్షులు రఘు కిరణాచార్యులు మాట్లాడుతూ బ్రాహ్మణ యువత ముందుకు వచ్చి ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలనుకాపాడాల్సినసమయంఆసన్నమైందన్నారు. బ్రాహ్మణులకు ఉద్యోగ, విద్యా భద్రత వంటి కీలక అంశాలపై మహాసభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలు నిరంతరంగా కొనసాగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ మహాసభకు గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీతారామశాస్త్రి, సందీప్ శర్మ, మధుసూదన్, జగన్నాథ్ దేశ్పాండే, ఉమా, ప్రభా, పావని, లక్ష్మీనరసింహాంబ, వసుంధర, కళ్యాణి, కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి