Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:36 PM

బొకేలు వద్దు… పేద పిల్లల చదువుకు చేయూత ఇవ్వండి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

బొకేలు వద్దు… పేద పిల్లల చదువుకు చేయూత ఇవ్వండి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

బొకేలు వద్దు… పేద పిల్లల చదువుకు చేయూత ఇవ్వండి జిల్లా కలెక్టర్ హనుమంత రావు
December 30, 2025 02:44 PM 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొకేలు వద్దు… పేద పిల్లల చదువుకు తోడ్పడండి

నూతన సంవత్సరానికి అర్థవంతమైన పిలుపు: బొకేల్స్ కాదు, విద్యా సామగ్రి ఇవ్వండి

స్థానికం ప్రతినిధి

నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు బొకేలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సూచించారు. సంప్రదాయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బొకేలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమే అయినప్పటికీ, వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, దుప్పట్లు వంటి అవసర సామగ్రిని అందించాలని ఆయన కోరారు.

నూతన సంవత్సరాన్ని అర్థవంతంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. పేద పిల్లలకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుకు దోహదం చేకూరుతుందని, చలికాలంలో దుప్పట్లు అందించడం వల్ల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సేకరించిన సామగ్రిని త్వరలోనే అర్హులైన విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని, నూతన సంవత్సరం వేడుకలను సేవాభావంతో మలచుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News