బాలికల ఆరోగ్య రక్షణే లక్ష్యం మన్సూరాబాద్లో హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన
బాలికల ఆరోగ్య రక్షణే లక్ష్యం మన్సూరాబాద్లో హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన
స్థానికం బృందం
మన్సూరాబాద్, బాలికల భవిష్యత్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మన్సూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అమిత ఆధ్వర్యంలో సహారా సర్కిల్ సమీపంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో హెచ్పీవీ వ్యాక్సిన్పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భాశయ కేన్సర్కు ప్రధాన కారణమైన హెచ్పీవీ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు 14–15 ఏళ్ల వయస్సులోనే వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. వ్యాక్సిన్ సురక్షితమైందని, వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వబడుతుందని చెప్పారు. తల్లిదండ్రులు అపోహలు నమ్మకుండా పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.
వైద్య సిబ్బంది వ్యాక్సిన్ మోతాదులు, ప్రయోజనాలు, స్వల్ప దుష్ప్రభావాలపై వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
బాలికల ఆరోగ్య రక్షణలో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి