PRINT TIME: March 25, 2026 08:34 PM
బాలసదన్ బాలికలకు మెరుగైన వసతులు కల్పించాలి: న్యాయ సేవ సంస్థ
బాలసదన్ బాలికలకు మెరుగైన వసతులు కల్పించాలి: న్యాయ సేవ సంస్థ
March 25, 2026 06:03 PM
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి,
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని బాలసదన్ను సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సందర్శించారు.
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు నిర్వహించిన ఈ సందర్శనలో, బాలసదన్లోని బాలికలతో ఆమె ముఖాముఖి మాట్లాడి వారికి కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై బాలికలకు మెరుగైన వసతులతో ఆశ్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు వారి అభిరుచులకు అనుగుణంగా ఆటలు, పాటలు, చిత్రలేఖనం, వ్యాసరచన, ప్రసంగం వంటి రంగాల్లో శిక్షణ కల్పించాలని తెలిపారు. జీవిత నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను శాఖ పరిమితుల మేరకు అమలు చేయాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి