Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:06 AM

బాలల హక్కులపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – కొడారి వెంకటేష్

బాలల హక్కులపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – కొడారి వెంకటేష్

బాలల హక్కులపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – కొడారి వెంకటేష్
21-03-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం, ఉచిత విద్య, ఇతర సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ హక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాకుండా గౌరవప్రదమైన జీవితం, ఆరోగ్యం, పోషకాహారం కూడా భాగమని గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు దానం కాదు, ప్రజలకు కల్పించిన హక్కులేనని స్పష్టం చేశారు.

దేశంలో పోషకాహార లోపంతో పిల్లలు బాధపడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లల సంక్షేమంపై మాట్లాడే ముందు, ఆ రంగంలో ఉన్న లోపాలు, అవినీతి అంశాలపై చర్చించడం అవసరమని సూచించారు.

Sthanikam

బాలల హక్కులపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – కొడారి వెంకటేష్

Article Image

బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం, ఉచిత విద్య, ఇతర సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ హక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాకుండా గౌరవప్రదమైన జీవితం, ఆరోగ్యం, పోషకాహారం కూడా భాగమని గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు దానం కాదు, ప్రజలకు కల్పించిన హక్కులేనని స్పష్టం చేశారు.

దేశంలో పోషకాహార లోపంతో పిల్లలు బాధపడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లల సంక్షేమంపై మాట్లాడే ముందు, ఆ రంగంలో ఉన్న లోపాలు, అవినీతి అంశాలపై చర్చించడం అవసరమని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News