బాలల హక్కులపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – కొడారి వెంకటేష్
బాలల హక్కులపై వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి – కొడారి వెంకటేష్
ఎడిటోరియల్ టీమ్
బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం, ఉచిత విద్య, ఇతర సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ హక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాకుండా గౌరవప్రదమైన జీవితం, ఆరోగ్యం, పోషకాహారం కూడా భాగమని గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు దానం కాదు, ప్రజలకు కల్పించిన హక్కులేనని స్పష్టం చేశారు.
దేశంలో పోషకాహార లోపంతో పిల్లలు బాధపడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లల సంక్షేమంపై మాట్లాడే ముందు, ఆ రంగంలో ఉన్న లోపాలు, అవినీతి అంశాలపై చర్చించడం అవసరమని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి