బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
Krishna
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సంగారెడ్డి భరోసా సెంటర్ ఆధ్వర్యంలో సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీ, గుమ్మడిదలలోని అనోర ఫార్మా కంపెనీలో బాలల భద్రత, చైల్డ్ సేఫ్టీ, యువత అభివృద్ధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ మాట్లాడుతూ లింగ సమానత్వం పాటించాలని, ఆడ–మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల మహిళలు ఎదుర్కొనే సమస్యలను వివరించి, పోక్సో చట్టాలపై అవగాహన కల్పిస్తూ బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఇటువంటి ఘటనల సమాచారాన్ని తప్పనిసరిగా అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. బాధితులు మౌనం వీడి ధైర్యంగా ముందుకు వస్తేనే న్యాయం జరిగి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డైల్ 100, మహిళా హెల్ప్లైన్ 181, చైల్డ్ హెల్ప్లైన్ 1098, జిల్లా భరోసా సెంటర్ నెంబర్ 8712656773లను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సదాశివపేట సీఐ వెంకటేశ్, ఎంఆర్ఎఫ్ అడ్మిన్ పటేల్, అనోర ఫార్మా హెచ్ఆర్ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, కంపెనీ యాజమాన్యం, భరోసా సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి