Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:57 PM

బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
April 29, 2026 07:55 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సంగారెడ్డి భరోసా సెంటర్ ఆధ్వర్యంలో సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీ, గుమ్మడిదలలోని అనోర ఫార్మా కంపెనీలో బాలల భద్రత, చైల్డ్ సేఫ్టీ, యువత అభివృద్ధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ మాట్లాడుతూ లింగ సమానత్వం పాటించాలని, ఆడ–మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల మహిళలు ఎదుర్కొనే సమస్యలను వివరించి, పోక్సో చట్టాలపై అవగాహన కల్పిస్తూ బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఇటువంటి ఘటనల సమాచారాన్ని తప్పనిసరిగా అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. బాధితులు మౌనం వీడి ధైర్యంగా ముందుకు వస్తేనే న్యాయం జరిగి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డైల్ 100, మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, జిల్లా భరోసా సెంటర్ నెంబర్ 8712656773లను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సదాశివపేట సీఐ వెంకటేశ్, ఎంఆర్ఎఫ్ అడ్మిన్ పటేల్, అనోర ఫార్మా హెచ్ఆర్ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, కంపెనీ యాజమాన్యం, భరోసా సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News