బాలల భద్రతకు సమాజం ముందుకు రావాలి: భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ
బాలల భద్రతకు సమాజం ముందుకు రావాలి: భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ
Krishna
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం సంగారెడ్డి భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ఐబి చౌరస్తా, ఆందోల్ నర్సింగ్ కాలేజ్, జోగిపేట బస్ స్టాండ్ ప్రాంతాల్లో చైల్డ్ సేఫ్టీ, బాలల రక్షణ, యువత అభివృద్ధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ మాట్లాడుతూ లింగ సమానత్వం పాటిస్తూ ఆడ, మగ తేడా లేకుండా సమానంగా చూడాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుందని వివరించారు. అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ బాలలపై లైంగిక వేధింపుల కేసులను తీవ్రంగా పరిగణించి నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బాధితులు మౌనం వీడి ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుందని, ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100, మహిళా హెల్ప్లైన్ 181, చైల్డ్ హెల్ప్లైన్ 1098తో పాటు జిల్లా భరోసా సెంటర్ నెంబర్ 8712656773ను సేవ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ యాదమ్మ, కార్మిక సంఘాల నాయకులు, భరోసా సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి