Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:03 AM

బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అధికారులు

బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అధికారులు

బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అధికారులు
30-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – మాదకద్రవ్య రహిత తెలంగాణ” వారోత్సవాల సందర్భంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో దత్తత సహాయ కేంద్రాన్ని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డాక్టర్ చక్రపాణి, బాలల సంక్షేమ సంఘం సభ్యుడు వెంకటేశం ప్రారంభించారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు చట్టబద్ధమైన దత్తతపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మహిళా ప్రాంగణంలో నిర్వహించిన దత్తత మరియు సంరక్షణ కుటుంబాలపై అవగాహన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ చట్టబద్ధ దత్తత ద్వారా పిల్లలకు కుటుంబ వాతావరణం, మంచి భవిష్యత్తు లభిస్తుందని, తల్లిదండ్రులకు కూడా పిల్లలతో కుటుంబ బంధాలు ఏర్పడతాయని వివరించారు. దత్తతకు ఇచ్చే ప్రతి శిశువుకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరువాతే దత్తత ప్రక్రియ చేపడతామని, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను ప్రత్యేక విభాగంలో దత్తతకు అందజేస్తామని తెలిపారు. అలాగే తాత్కాలిక దత్తత, సంరక్షణ కుటుంబాల విధానం, దత్తతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, మిషన్ వాత్సల్య పోర్టల్ వినియోగం, శిశు గృహాల్లో పిల్లలకు అందిస్తున్న సంరక్షణ సేవల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు, బాలల పరిరక్షణ విభాగ సిబ్బంది, బాలల సహాయవాణి ప్రతినిధులు, సఖి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

బాలల భద్రత వారోత్సవాల్లో భాగంగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అధికారులు

Article Image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – మాదకద్రవ్య రహిత తెలంగాణ” వారోత్సవాల సందర్భంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో దత్తత సహాయ కేంద్రాన్ని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డాక్టర్ చక్రపాణి, బాలల సంక్షేమ సంఘం సభ్యుడు వెంకటేశం ప్రారంభించారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు చట్టబద్ధమైన దత్తతపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మహిళా ప్రాంగణంలో నిర్వహించిన దత్తత మరియు సంరక్షణ కుటుంబాలపై అవగాహన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ చట్టబద్ధ దత్తత ద్వారా పిల్లలకు కుటుంబ వాతావరణం, మంచి భవిష్యత్తు లభిస్తుందని, తల్లిదండ్రులకు కూడా పిల్లలతో కుటుంబ బంధాలు ఏర్పడతాయని వివరించారు. దత్తతకు ఇచ్చే ప్రతి శిశువుకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరువాతే దత్తత ప్రక్రియ చేపడతామని, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను ప్రత్యేక విభాగంలో దత్తతకు అందజేస్తామని తెలిపారు. అలాగే తాత్కాలిక దత్తత, సంరక్షణ కుటుంబాల విధానం, దత్తతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, మిషన్ వాత్సల్య పోర్టల్ వినియోగం, శిశు గృహాల్లో పిల్లలకు అందిస్తున్న సంరక్షణ సేవల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు, బాలల పరిరక్షణ విభాగ సిబ్బంది, బాలల సహాయవాణి ప్రతినిధులు, సఖి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News