బక్రీద్ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్
బక్రీద్ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్
Editor Desk
కర్నూలు: బక్రీద్ పండుగను ప్రజలందరూ పరస్పర సహకారం, సోదరభావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కోరారు. పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
రేపు జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, సోషల్ మీడియాలో వదంతుల నియంత్రణ వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించేందుకు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ప్రజలు అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 9121101003 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
గోవుల అక్రమ రవాణా నివారణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై సైబర్ వింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆదోని ఇన్చార్జ్ డీఎస్పీ భార్గవి, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్రావు, ఆదోని పట్టణ సీఐలు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి