బక్రీద్ వేళ మానవత్వాన్ని చాటిన:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
బక్రీద్ వేళ మానవత్వాన్ని చాటిన:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని వివిధ గ్రామాలకు చెందిన మైనారిటీ సోదరీమణులకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బక్రీద్ పండుగ అనేది కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాకుండా దానధర్మాలు, మానవత్వం, సహాయ సహకారాలకు ప్రతీక అని అన్నారు. మతం ఏదైనా ప్రతి మనిషిలో దయ, కరుణ, పంచుకునే గుణం ఉండాలని అన్ని మతాలు బోధిస్తాయని తెలిపారు. మన దగ్గర ఉన్నదాంట్లో కొంతైనా అవసరమైన వారికి పంచడం ద్వారా నిజమైన ఆనందం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నాయని, పండుగ సమయంలో వారికి సహాయం చేయడం ద్వారా వారి ఇంట్లో కూడా ఆనందం నింపగలమన్నారు. ఆకలి అనేది అందరికీ సమానమని, శక్తికొద్దీ పేదలకు దానధర్మాలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి