Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:41 PM

బైకాని నరసింహ మృతి పార్టీకి తీరని లోటు: ఎండి జహంగీర్

బైకాని నరసింహ మృతి పార్టీకి తీరని లోటు: ఎండి జహంగీర్

బైకాని నరసింహ మృతి పార్టీకి తీరని లోటు: ఎండి జహంగీర్
March 21, 2026 06:39 PM 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట మండలంలోని పల్లివాడకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, హమాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బైకాని నరసింహ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

శనివారం ఆయన సీపీఎం మండల నాయకత్వంతో కలిసి నరసింహ మృతదేహానికి పూలమాలలు అర్పించి జోహార్లు ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నరసింహ నిబద్ధత గల కమ్యూనిస్టు కార్యకర్తగా గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడారని గుర్తు చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం, హమాలి యూనియన్‌లో కీలక పాత్ర పోషిస్తూ గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిజాయితీగా పనిచేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు.

నరసింహ అకాల మరణం గ్రామంతో పాటు మండల స్థాయి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి నాగేష్, నాయకులు కందుల హనుమంతు, గన్నేబోయిన విజయభాస్కర్, గాదె నరేందర్, తొలుపునూరి శ్రీనివాస్, ఉపసర్పంచ్ పావిరాల మత్స్యగిరి, ముక్కముల మల్లేష్, శాఖా కార్యదర్శులు తాళ్లపల్లి జితేందర్, పులిబిక్షం, మునికుంట్ల లెనిన్, గోగు లింగస్వామి, జనపాల లక్ష్మణ్, వార్డు సభ్యులు గట్టు ఉపేందర్, దండిగ నరసింహ, తొలుపునూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News