Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 21, 2026 08:18 PM

బైకాని నరసింహ మృతి పార్టీకి తీరని లోటు: ఎండి జహంగీర్

బైకాని నరసింహ మృతి పార్టీకి తీరని లోటు: ఎండి జహంగీర్

బైకాని నరసింహ మృతి పార్టీకి తీరని లోటు: ఎండి జహంగీర్
March 21, 2026 06:39 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
ఎడిటోరియల్ టీమ్

రామన్న పేట మండలంలోని పల్లివాడకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, హమాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బైకాని నరసింహ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

శనివారం ఆయన సీపీఎం మండల నాయకత్వంతో కలిసి నరసింహ మృతదేహానికి పూలమాలలు అర్పించి జోహార్లు ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నరసింహ నిబద్ధత గల కమ్యూనిస్టు కార్యకర్తగా గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడారని గుర్తు చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం, హమాలి యూనియన్‌లో కీలక పాత్ర పోషిస్తూ గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిజాయితీగా పనిచేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు.

నరసింహ అకాల మరణం గ్రామంతో పాటు మండల స్థాయి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి నాగేష్, నాయకులు కందుల హనుమంతు, గన్నేబోయిన విజయభాస్కర్, గాదె నరేందర్, తొలుపునూరి శ్రీనివాస్, ఉపసర్పంచ్ పావిరాల మత్స్యగిరి, ముక్కముల మల్లేష్, శాఖా కార్యదర్శులు తాళ్లపల్లి జితేందర్, పులిబిక్షం, మునికుంట్ల లెనిన్, గోగు లింగస్వామి, జనపాల లక్ష్మణ్, వార్డు సభ్యులు గట్టు ఉపేందర్, దండిగ నరసింహ, తొలుపునూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News