బైక్, మేకల దొంగల అరెస్ట్ 7 బైకులు, కారు స్వాధీనం.. అంతర్రాష్ట్ర దొంగ పట్టివేత.
బైక్, మేకల దొంగల అరెస్ట్ 7 బైకులు, కారు స్వాధీనం.. అంతర్రాష్ట్ర దొంగ పట్టివేత.
Editor Desk
నార్కట్పల్లి: బైకులు, మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగతో పాటు ఓ మైనర్ బాలుడిని నార్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, 7 మోటార్సైకిళ్లు, దొంగతనాలకు వినియోగించిన బ్రెజ్జా కారును స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి తెలిపారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బైక్, పశువుల దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు బుధవారం నార్కట్పల్లి ఫ్లైఓవర్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్ లేని హీరో ప్యాషన్ ప్రో బైక్పై వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.
పట్టుబడిన గువ్వల శబరీష్పై నల్లగొండ జిల్లాలో 18 కేసులు, ఇతర రాష్ట్రాల్లో 3 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలుడితో కలిసి గ్రామాల్లో రేకీ నిర్వహించి రాత్రివేళల్లో మేకలు, గొర్రెలను దొంగిలించి గుంటూరు జిల్లా నల్లపాడు సంతలో విక్రయించేవాడని వెల్లడించారు. ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులను తాళాలు విరగ్గొట్టి ఫేక్ నంబర్ప్లేట్లు అమర్చి విక్రయించేవారని తెలిపారు.
నార్కట్పల్లి, దేవరకొండ, కొండమల్లేపల్లి, నల్లగొండ రూరల్, అచ్చంపేట, నెల్లూరు ప్రాంతాల్లో జరిగిన పలు దొంగతనాల్లో నిందితుల పాత్ర ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
కేసును ఛేదించిన నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయిలను జిల్లా ఎస్పీ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి