గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ అడుగులు – మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం
రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్దాం
మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.పార్టీని మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు,క్యాడర్కు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి