బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలం: వట్టే జానయ్య యాదవ్
బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలం: వట్టే జానయ్య యాదవ్
Biksham
బహుజనుల హక్కుల సాధన దిశగా కీలక పాత్ర పోషించిన మహనీయుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ స్ఫూర్తితో నిర్వహించిన మండల్ పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. బహుజనుల రాజ్యాధికార సాధన సమితి మరియు పలు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంలో మండల్ కృషి మరువలేనిదని కొనియాడారు. మండల్ కమిషన్ ద్వారా వెనుకబడిన తరగతులకు లభించిన ప్రయోజనాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలమని, అందరూ సంఘటితంగా కృషి చేసినప్పుడే నిజమైన రాజ్యాధికారం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురికి మండల్ పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజా నాయకులు, బహుజన మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి