Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:32 PM

బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలం: వట్టే జానయ్య యాదవ్

బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలం: వట్టే జానయ్య యాదవ్

బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలం: వట్టే జానయ్య యాదవ్
April 13, 2026 06:22 PM 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బహుజనుల హక్కుల సాధన దిశగా కీలక పాత్ర పోషించిన మహనీయుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ స్ఫూర్తితో నిర్వహించిన మండల్ పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. బహుజనుల రాజ్యాధికార సాధన సమితి మరియు పలు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంలో మండల్ కృషి మరువలేనిదని కొనియాడారు. మండల్ కమిషన్ ద్వారా వెనుకబడిన తరగతులకు లభించిన ప్రయోజనాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలమని, అందరూ సంఘటితంగా కృషి చేసినప్పుడే నిజమైన రాజ్యాధికారం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురికి మండల్ పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజా నాయకులు, బహుజన మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News