Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:57 PM

బీసీ సబ్ ప్లాన్ లేకుండా అభివృద్ధి శూన్యం తహశీల్దార్‌కు వినతి పత్రం

బీసీ సబ్ ప్లాన్ లేకుండా అభివృద్ధి శూన్యం తహశీల్దార్‌కు వినతి పత్రం

బీసీ సబ్ ప్లాన్ లేకుండా అభివృద్ధి శూన్యం తహశీల్దార్‌కు వినతి పత్రం
January 07, 2026 04:04 PM 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పెన్పహాడ్ తహశీల్దార్‌కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వినతి పత్రం

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ శ్రీ వట్టె జానయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల తహశీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధి పేరుతో కేటాయించిన నిధులు ఇతర అవసరాలకు మళ్లిపోకుండా ఉండాలంటే బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలుతోనే బీసీల విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. బీసీ వర్గాలకు సామాజిక న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, పెన్పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నరహరి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యగ్గడి మురళి, జిల్లా నాయకులు మామిడి శోభన్ బాబు, యాదగిరి రంగయ్య, మధు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ వర్గాల హక్కుల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, బీసీ సబ్ ప్లాన్ పూర్తిస్థాయిలో అమలు అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నాయకులు తేల్చిచెప్పారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News