PRINT TIME: April 08, 2026 11:57 AM
బడిబాట ర్యాలీ: ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను చాటిన ఉపాధ్యాయులు
బడిబాట ర్యాలీ: ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను చాటిన ఉపాధ్యాయులు
April 08, 2026 09:09 AM
11 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish HS
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత దుస్తువులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరి విద్యను అభ్యసించాలని, తద్వారా ఉన్నత విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా,నాయకులుగా ఎదగవచ్చని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి