రామన్నపేట పట్టణంలోని 7వ వార్డుకు చెందిన కక్కునూరి ఆంతమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో కాంగ్రెస్, సీపీఐ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్ రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
మృతురాలి కుటుంబానికి ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఉపసర్పంచ్ మోటే రమేష్, సీపీఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జమీరుద్దీన్, ఎండి అక్రమ్, 7వ వార్డు సభ్యుడు ఉట్కూరి శీను, మీర్జా ఇనాయత్ బేగ్, శివాజీ శ్రీకాంత్, పట్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి