బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి
బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం బొర్గి తండాకు చెందిన సావిత్రిబాయి, నికిత, నందిని ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషాద ఘటనపై నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన బాధిత కుటుంబాల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇలాంటి విషాదకర ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని, ఒకేసారి కుటుంబంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు నిరుపేద కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా బహిరంగ బావులు, ప్రమాదకర ప్రదేశాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. అనంతరం మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజ్ పటేల్, బసవరాజ్ పటేల్, హుల్బరావు, అబ్రం, ప్రకాష్ రెడ్డి, సురేష్ రావు, మనోజ్, భూమప్ప తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి