PRINT TIME: June 23, 2026 04:05 PM
బాదల్గాంలో గోండేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న:ఖేఢ్ ఎమ్మెల్యే
బాదల్గాంలో గోండేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న:ఖేఢ్ ఎమ్మెల్యే
April 20, 2026 08:19 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలోని బాదల్గాం గ్రామంలో సోమవారం శ్రీ బొంబు గోండేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందుతాయని, భక్తి భావంతో సమాజం మరింత బలపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిగంబర్ రెడ్డి, నర్సింలు, సర్పంచులు, సిద్ధ రెడ్డి, విజయ్ కుమార్, ప్రభు గోండ, కాశీనాథ్, మల్లిఖార్జున్, కురుమ సోదరులు తదితర నాయకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి