Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు: ఎస్ఎఫ్ఐ ఆగ్రహం స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 08:32 PM

బచ్చోడులో భక్తి వెల్లువ… శివ–కేశవుల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

బచ్చోడులో భక్తి వెల్లువ… శివ–కేశవుల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

బచ్చోడులో భక్తి వెల్లువ… శివ–కేశవుల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
March 25, 2026 06:26 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తిరుమలాయపాలెం,

మండల పరిధిలోని బచ్చోడు గ్రామం ఆధ్యాత్మిక చైతన్యంతో కళకళలాడింది. మూడు రోజులుగా శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్లతో పాటు శ్రీరామ లింగేశ్వర, కనకదుర్గమ్మ ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం ప్రధాన ఘట్టంతో వైభవంగా ముగిశాయి.

వేద పండితుల ఆధ్వర్యంలో జలధివాసం, ధాన్యధివాసం వంటి క్రతువులు నిర్వహించిన అనంతరం, బుధవారం తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్ఛారణలు మారుమోగాయి. ఉదయం వాస్తు పూజ, పంచలోహ నవరత్న స్థాపన కార్యక్రమాలు నిర్వహించి, ఉదయం 9:50 గంటల సుముహూర్తాన విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఘట్టాలను ఘనంగా నిర్వహించారు.

మంగళవాయిద్యాల నడుమ స్వామివార్లకు ప్రాణ ప్రతిష్ఠ చేయగా భక్తుల జయజయధ్వానాలతో గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రామసహాయం నరేష్ రెడ్డి, రామసహాయం అరవింద్ రెడ్డి, హరిత రెడ్డి, బెల్లం శ్రీను, గండ్ర గోపాలరావు, కొప్పుల అశోక్, మంగీలాల్, ఉన్నం రాజశేఖర్, ఎన్. లింగయ్య, బి. సుదర్శన్, కరీం, వనవాసం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News