బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన భీమ్ ఆర్మీ తెలంగాణ నాయకులు
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన భీమ్ ఆర్మీ తెలంగాణ నాయకులు
RAPOLU LINGASWAMY
మాజీ ఉప ప్రధాని, దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేత బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఘనంగా నిర్వహించింది. భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రవి కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మలక్పేట్ నియోజకవర్గంలోని మూసారాంబాగ్ ప్రాంతంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సమాజ సేవలు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ పలువురు నాయకులు మాట్లాడారు. దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని, సమానత్వం, సామాజిక న్యాయం, సామాజిక అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో నడవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఎస్.టి వింగ్ అధ్యక్షుడు ఇస్లావాత్ వెంకటేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి