Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:25 PM

బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి
April 14, 2026 04:23 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి పొంగులేటి పిలుపు

భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కల్లూరు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News