బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి
బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి
Biksham
అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి పొంగులేటి పిలుపు
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కల్లూరు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారుఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి