బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఘనంగా
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఘనంగా
Biksham
సర్వోత్తమ్ రెడ్డి, నివేదిత లక్షాది చేతుల మీదుగా ప్రారంభం
సూర్యాపేట: పట్టణంలోని 9వ వార్డు బలహీన వర్గాల కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది సంయుక్తంగా విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. బాల్యం నుంచి వివక్షను ఎదుర్కొంటూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
సమాజంలో అస్పృశ్యతను నిర్మూలించి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి