Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:28 PM

బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఘనంగా

బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఘనంగా

బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఘనంగా
April 14, 2026 04:24 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సర్వోత్తమ్ రెడ్డి, నివేదిత లక్షాది చేతుల మీదుగా ప్రారంభం

సూర్యాపేట: పట్టణంలోని 9వ వార్డు బలహీన వర్గాల కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది సంయుక్తంగా విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. బాల్యం నుంచి వివక్షను ఎదుర్కొంటూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

సమాజంలో అస్పృశ్యతను నిర్మూలించి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News