అయ్యప్ప సేవ సమితి రక్తదాన శిబిరం ఘన విజయం
అయ్యప్ప సేవ సమితి రక్తదాన శిబిరం ఘన విజయం
Krishna
సామాజిక సేవలో అయ్యప్ప సేవ సమితి ముందడుగు
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీరామ మందిరంలో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఈ శిబిరంలో మొత్తం 51 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు అయ్యప్ప గురుస్వామి కోస్గికర్ శివానంద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ సేవే లక్ష్యంగా అయ్యప్ప సేవ సమితి ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని తెలిపారు. రక్తదాన శిభిరంకు సహాయ సహకారాలు అందించిన నాగిరెడ్డి, సుశీల మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకర్త, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి. ఓం ప్రకాష్, అలాగే పాండు గురు స్వామి, మధుసూదన్ రెడ్డి గురు స్వామి,సంజయ్ ప్రసాద్ గురు స్వామి, సుబ్బారెడ్డి గురుస్వామి, భూమయ్య గురుస్వామి,దత్తు గురుస్వామి, సంగప్ప గురుస్వామి, వంశీ గురుస్వామి, నాగిరెడ్డి,
మదన్ లాల్ తదితర గురుస్వాములు, స్వాములు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి