Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:23 PM

అవినీతిని పెంపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

అవినీతిని పెంపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

అవినీతిని పెంపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
05-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతి, అక్రమాలకు ఊతమిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని 39, 41 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట పట్టణం వేల కోట్ల రూపాయల నిధులతో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఆ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ నాయకులు నేడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ జల్సాలు చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. పట్టణ అభివృద్ధి మళ్లీ గాడిలో పడాలంటే ప్రతి ఓటరు కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు అభ్యర్థి దంతాల సాయిప్రియ సందీప్, 41వ వార్డు అభ్యర్థి ఢిల్లీ పావని ఉపేందర్, నాయకులు ఉప్పల ఆనంద్, పుట్ట కిషోర్, వెంపటి సురేష్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, 6వ వార్డు కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అవినీతిని పెంపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Article Image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతి, అక్రమాలకు ఊతమిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని 39, 41 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట పట్టణం వేల కోట్ల రూపాయల నిధులతో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఆ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ నాయకులు నేడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ జల్సాలు చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. పట్టణ అభివృద్ధి మళ్లీ గాడిలో పడాలంటే ప్రతి ఓటరు కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు అభ్యర్థి దంతాల సాయిప్రియ సందీప్, 41వ వార్డు అభ్యర్థి ఢిల్లీ పావని ఉపేందర్, నాయకులు ఉప్పల ఆనంద్, పుట్ట కిషోర్, వెంపటి సురేష్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, 6వ వార్డు కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News