Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

అవినీతిని పెంపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

అవినీతిని పెంపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

అవినీతిని పెంపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
February 05, 2026 01:02 AM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతి, అక్రమాలకు ఊతమిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని 39, 41 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట పట్టణం వేల కోట్ల రూపాయల నిధులతో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఆ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ నాయకులు నేడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ జల్సాలు చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. పట్టణ అభివృద్ధి మళ్లీ గాడిలో పడాలంటే ప్రతి ఓటరు కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు అభ్యర్థి దంతాల సాయిప్రియ సందీప్, 41వ వార్డు అభ్యర్థి ఢిల్లీ పావని ఉపేందర్, నాయకులు ఉప్పల ఆనంద్, పుట్ట కిషోర్, వెంపటి సురేష్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, 6వ వార్డు కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News