ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్పై సీఐ రాఘవన్ హెచ్చరిక
ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్పై సీఐ రాఘవన్ హెచ్చరిక
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి: ప్రయాణికుల ప్రాణాలు, మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నాయని సీఐ రాఘవన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా సీఐ రాఘవన్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అయితే డ్రైవింగ్లో అజాగ్రత్త ప్రాణనష్టాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. మీ ప్రవర్తన మంచిగా ఉంటే మీ పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారని, ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు.
ప్రతిరోజూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం మీ బాధ్యత అని, మీ ప్రాణాలే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ యాదవ్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి