Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన ఎస్.కే. చాంద్ సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 03:37 PM

అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి

అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి

అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి
May 06, 2026 02:28 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ఇప్పటికే 3 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి పాతబడిపోవడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు అత్యవసర రోగులను తరలించే సమయంలో అంబులెన్స్ మధ్యలో నిలిచిపోవడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా అత్యవసర సేవల కోసం ఇదే అంబులెన్స్‌పై ఆధారపడుతున్నందున పాత అంబులెన్స్ స్థానంలో వెంటనే కొత్త 108 అంబులెన్స్‌ను మంజూరు చేసి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రంట ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేశారు.నారాయణఖేడ్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు నిరంతరంగా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News