అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి
అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి
Krishna
నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ఇప్పటికే 3 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి పాతబడిపోవడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు అత్యవసర రోగులను తరలించే సమయంలో అంబులెన్స్ మధ్యలో నిలిచిపోవడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా అత్యవసర సేవల కోసం ఇదే అంబులెన్స్పై ఆధారపడుతున్నందున పాత అంబులెన్స్ స్థానంలో వెంటనే కొత్త 108 అంబులెన్స్ను మంజూరు చేసి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రంట ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేశారు.నారాయణఖేడ్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు నిరంతరంగా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి