Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటర్‌లో స్టేట్ ర్యాంకులతో ఆదోని విద్యార్థినుల సత్తా నారా లోకేష్ స్ఫూర్తితో విద్యా రంగంలో ముందడుగు: దేవేంద్రప్ప బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 07:40 PM

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
May 07, 2026 06:33 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

అంతరాష్ట్ర సరిహద్దులో క్షుణ్ణంగా పోలీస్ తనిఖీలు

రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య వారధిగా ఉన్న జాతీయ రహదారి 65 పై కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాపురం వద్ద ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను గురువారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పరిశీలించారు. వరి ధాన్యం, ప్రభుత్వ పంపిణీ బియ్యం, పశువుల రవాణా, మద్యం, ఇసుక, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నిర్మూలించడంలో భాగంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ ద్వారమైన సూర్యాపేట జిల్లా రామాపురం వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ చెక్ పోస్ట్ నందు పోలీసు సిబ్బంది రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారని అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడంలో పటిష్టంగా పనిచేస్తున్నామని ఎస్పీ తెలిపారు. చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు. చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సామాన్య ప్రజానీకానికి సామాన్య ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తనిఖీలు క్షుణ్ణంగా నిర్వహించాలని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ఈ సరిహద్దు చెక్ పోస్ట్ నందు పటిష్టమైన నిఘా ఉంచామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని తెలంగాణకు వచ్చి అమ్మకుండా గా ఉంచామని ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని.ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అనంతగిరి ఎస్సై నవీన్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News