Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 10:04 PM

అసెంబ్లీ లో ఆరు గ్యారెటీల కు చట్టబద్ధత కల్పించాలి; తాటికొండ సీతయ్య

అసెంబ్లీ లో ఆరు గ్యారెటీల కు చట్టబద్ధత కల్పించాలి; తాటికొండ సీతయ్య

అసెంబ్లీ లో ఆరు గ్యారెటీల కు చట్టబద్ధత కల్పించాలి; తాటికొండ సీతయ్య
March 26, 2026 08:25 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అభయహస్తం పేరుతో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో చట్ట బద్దత కల్పించాలని తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బీ ఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య పాల్గొని మాట్లాడుతూ... ఎన్నికలముందు మహిళలకు 2500. వికలాంగులకు 6000. వృద్ధులకు.4000.రైతులకు 15000వేలు. నిరుద్యోగభృతి . విద్యార్థులకు విద్యాభరోస కార్డు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అధికారానికి వచ్చిరెండున్నరెండ్లు అవుతున్న ఒక్కటి నెరవేర్చ లేదని అన్నారు. అధికారం లోకి రాగానే చట్ట బద్దత కల్పిస్తామని చెప్పిన మాటలు మరిచిపోయిన ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ లో ప్రవేశ పెట్టబోయే ప్రైవేట్ మంబర్ బిల్లు కు ప్రభుత్వం మద్దతివ్వాలని అన్నారు.. ఏప్రిల్ నెలాఖరు వరకు కాల్వల్లో నీళ్లు ఇవ్వాలని నోటికాడికి వచ్చిన వరిపంట ఎండిపోకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని. రైతు భరోసా వాయిదా పద్ధతుల్లో కాకుండా ఎకరానికి ఆరువేల చొప్పున యాసంగి పంట డబ్బులను ఒకేసారి ఇవ్వాలని అన్నారు. యాసంగి పంటకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా కొత్తలప్పుడు వాయిదాలప్రాకారమివ్వడమంటే ఈ పేరుతో వచ్చే వానకాలం భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ఎత్తుగడ చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీనివాస్. సర్పంచ్ శ్రీనివాసరెడ్డి. నాయకులు. మట్టిపెల్లి వెంకట్. మన్నూరు పోతరాజు. ఇసాకర్. సతీష్. బెడద రాములు. మాజీ సర్పంచ్ సోమశేఖర్. సైదులు. సరిత. బింగివెంకన్న, మహేష్. తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News