Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:06 PM

అసెంబ్లీ లో ఆరు గ్యారెటీల కు చట్టబద్ధత కల్పించాలి; తాటికొండ సీతయ్య

అసెంబ్లీ లో ఆరు గ్యారెటీల కు చట్టబద్ధత కల్పించాలి; తాటికొండ సీతయ్య

అసెంబ్లీ లో ఆరు గ్యారెటీల కు చట్టబద్ధత కల్పించాలి; తాటికొండ సీతయ్య
March 26, 2026 08:25 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అభయహస్తం పేరుతో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో చట్ట బద్దత కల్పించాలని తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బీ ఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య పాల్గొని మాట్లాడుతూ... ఎన్నికలముందు మహిళలకు 2500. వికలాంగులకు 6000. వృద్ధులకు.4000.రైతులకు 15000వేలు. నిరుద్యోగభృతి . విద్యార్థులకు విద్యాభరోస కార్డు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అధికారానికి వచ్చిరెండున్నరెండ్లు అవుతున్న ఒక్కటి నెరవేర్చ లేదని అన్నారు. అధికారం లోకి రాగానే చట్ట బద్దత కల్పిస్తామని చెప్పిన మాటలు మరిచిపోయిన ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ లో ప్రవేశ పెట్టబోయే ప్రైవేట్ మంబర్ బిల్లు కు ప్రభుత్వం మద్దతివ్వాలని అన్నారు.. ఏప్రిల్ నెలాఖరు వరకు కాల్వల్లో నీళ్లు ఇవ్వాలని నోటికాడికి వచ్చిన వరిపంట ఎండిపోకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని. రైతు భరోసా వాయిదా పద్ధతుల్లో కాకుండా ఎకరానికి ఆరువేల చొప్పున యాసంగి పంట డబ్బులను ఒకేసారి ఇవ్వాలని అన్నారు. యాసంగి పంటకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా కొత్తలప్పుడు వాయిదాలప్రాకారమివ్వడమంటే ఈ పేరుతో వచ్చే వానకాలం భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ఎత్తుగడ చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీనివాస్. సర్పంచ్ శ్రీనివాసరెడ్డి. నాయకులు. మట్టిపెల్లి వెంకట్. మన్నూరు పోతరాజు. ఇసాకర్. సతీష్. బెడద రాములు. మాజీ సర్పంచ్ సోమశేఖర్. సైదులు. సరిత. బింగివెంకన్న, మహేష్. తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News