Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ నియామకం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 05:40 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనదే...

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనదే...

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనదే...
April 24, 2026 03:48 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

కార్మికులకు అండగా సిపిఐ

ప్రతిష్టకు పోకుండా చర్చలు జరిపించాలి...

సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని ఆర్టీసీ కార్మికుల సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని *సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు*. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ముందు జరుగుతున్న మూడో రోజు సమ్మెకు వారు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు సహనం కోల్పోవద్దని తీవ్ర చర్యలకు పాల్పడవద్దని వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు చేసిన కృషి గుర్తుంచుకోవాలన్నారు పి ఆర్ సి చట్టబద్ధంగా అమలు చేసే అంశం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ప్రభుత్వానికి ఉండబోవని గత ప్రభుత్వం హాయంలో రద్దు చేసిన గుర్తింపు యూనియన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వాటిని పునరుద్దిస్తామని హామీ ఇచ్చిందని వారు గుర్తు చేశారు. ఇకనైనా వారి సమస్యలు పరిష్కరించకపోతే వారికి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గురువారం నర్సంపేట డిపో వద్ద శంకర్ గౌడ్ అనే కార్మికుడు నిప్పండించుకొని 80% శాతం కాలి చనిపోయిన కార్మికునికి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. నల్లగొండ ,భద్రాచలం ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యయత్నం చేశారని . ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కాదని కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులతో తగువు పెట్టుకుంటే పతనం తప్పదని యూనియన్ అంటే పాలకులకు భయమెందుకు అన్నారు. డిమాండు పరిష్కరించే వరకు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బోరా వెంకటేశ్వర్లు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News