Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి పెదపాడు పోలీసుల అండ – మానవీయత చాటిన ఎస్ ఐ ఆర్. శ్రీనివాస్

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి పెదపాడు పోలీసుల అండ – మానవీయత చాటిన ఎస్ ఐ ఆర్. శ్రీనివాస్

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి పెదపాడు పోలీసుల అండ – మానవీయత చాటిన ఎస్ ఐ ఆర్. శ్రీనివాస్
March 15, 2026 12:17 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెదపాడు పోలీసుల మానవీయత మరోసారి వెలుగుచూసింది. శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా సామాజిక బాధ్యతలోనూ తాము ముందుంటామని పెదపాడు పోలీసులు నిరూపించారు. ఆపదలో ఉన్న ఒక పేద కుటుంబాన్ని ఆదుకుని తమ ఉదారతను చాటుకున్నారు. పెదపాడు గ్రామానికి చెందిన నేలగట్ల నరసింహారావు (36) గత కొంతకాలంగా పచ్చకామెర్లు వ్యాధితో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన మృతి చెందారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడమే కాకుండా తీవ్ర పేదరికంలో ఉన్న ఆ కుటుంబం కనీసం అంత్యక్రియల తర్వాతి కార్యక్రమాలను నిర్వహించుకోలేని దయనీయ పరిస్థితిలో పడింది.

ఈ విషయాన్ని గమనించిన గ్రామ పెద్దలు పెదపాడు ఎస్ ఐ ఆర్. శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎస్సై మానవీయ కోణంలో స్పందించారు. మృతుని దశదిన కార్యక్రమం నిర్వహించుకునేందుకు పెదపాడు పోలీస్ స్టేషన్ తరపున 75 కిలోల బరువున్న మూడు బియ్యం బస్తాలను ఆ కుటుంబానికి అందజేశారు. పోలీసు అధికారి హోదాలో ఉన్నప్పటికీ తమ కష్టాన్ని గుర్తించి సొంత మనిషిలా ఆదుకున్న ఎస్ ఐ ఆర్. శ్రీనివాస్‌కు మృతుని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఖాకీ డ్రస్సులో ఉన్న మానవత్వాన్ని చూసి గ్రామస్తులు ఎస్ ఐ శ్రీనివాస్‌కు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News