PRINT TIME: June 22, 2026 01:39 PM
అనంతారం ఎక్స్ రోడ్ వద్ద యువకుడి ఆత్మహత్య
అనంతారం ఎక్స్ రోడ్ వద్ద యువకుడి ఆత్మహత్య
April 18, 2026 02:16 PM
243 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం ఎక్స్ రోడ్ వద్ద శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. యువకుడు ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి