PRINT TIME: May 27, 2026 12:24 PM
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ సహాయం
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ సహాయం
May 27, 2026 11:19 AM
22 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రవ్వ శ్రవణ్ కుమార్ (35) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శ్రీమతి ఈడెం రాధా శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భర్త ఈడెం శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రవణ్ కుమార్ మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్న వెంకటేశం, కార్యదర్శి పిట్ట మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మిరియాల జగన్నాథం, పాశం దీక్షిత్, ఠాకూర్ రమేష్ సింగ్, గంజి రంగయ్య, గూడెల్లి దామోదర్, నన్నూరి రవీందర్, కర్రే రాజు, మిరియాల రాజు తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి