అన్నదాతలకు ఉగాది కానుకగా రూ.20 వేల పెట్టుబడి సాయం – మంత్రి కొలుసు పార్థసారథి
అన్నదాతలకు ఉగాది కానుకగా రూ.20 వేల పెట్టుబడి సాయం – మంత్రి కొలుసు పార్థసారథి
GADDAM JAGANMOHAN REDDY
ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” మూడవ విడత కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు నమూనా చెక్కులను అందజేశారు. జిల్లాలో మూడవ విడతగా 1,60,968 మంది రైతులకు రూ.89.85 కోట్లు జమ కాగా, నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు రూ.19.77 కోట్లు, ముసునూరు మండలంలో 8,205 మంది రైతులకు రూ.4.64 కోట్లు లబ్ధి చేకూరింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.14 వేలును కలిపి మొత్తం రూ.20 వేలును మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి