Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:35 AM

అన్నదాతలకు ఉగాది కానుకగా రూ.20 వేల పెట్టుబడి సాయం – మంత్రి కొలుసు పార్థసారథి

అన్నదాతలకు ఉగాది కానుకగా రూ.20 వేల పెట్టుబడి సాయం – మంత్రి కొలుసు పార్థసారథి

అన్నదాతలకు ఉగాది కానుకగా రూ.20 వేల పెట్టుబడి సాయం – మంత్రి కొలుసు పార్థసారథి
14-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” మూడవ విడత కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు నమూనా చెక్కులను అందజేశారు. జిల్లాలో మూడవ విడతగా 1,60,968 మంది రైతులకు రూ.89.85 కోట్లు జమ కాగా, నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు రూ.19.77 కోట్లు, ముసునూరు మండలంలో 8,205 మంది రైతులకు రూ.4.64 కోట్లు లబ్ధి చేకూరింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.14 వేలును కలిపి మొత్తం రూ.20 వేలును మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Sthanikam

అన్నదాతలకు ఉగాది కానుకగా రూ.20 వేల పెట్టుబడి సాయం – మంత్రి కొలుసు పార్థసారథి

Article Image

ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” మూడవ విడత కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు నమూనా చెక్కులను అందజేశారు. జిల్లాలో మూడవ విడతగా 1,60,968 మంది రైతులకు రూ.89.85 కోట్లు జమ కాగా, నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు రూ.19.77 కోట్లు, ముసునూరు మండలంలో 8,205 మంది రైతులకు రూ.4.64 కోట్లు లబ్ధి చేకూరింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.14 వేలును కలిపి మొత్తం రూ.20 వేలును మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News