శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం JJR నగర్లో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానికులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పెనుకొండలో బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా సోమందేపల్లి మాజీ ఎంపీటీసీ కిష్టప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. JJR నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి